ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బాల గురవయ్యవారి పల్లి దళితులు రెండవ రోజు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా!…

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 03.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// నేడు పుంగనూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద బాల గురవయ్య వారి పల్లె కు చెందిన దళిత మహిళలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ధర్నా ప్రారంభించి రెండవ రోజు చేరుకుంది. దీనిపై ఇంతవరకు తాసిల్దార్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోకపోవడంతో యధావిధిగా రెండో రోజు కూడా ధర్నా చేయడం జరిగింది వారికి మద్దతుగా రాష్ట్ర దళిత నాయకుడు చిన్న రాయుడు మద్దతు తెలపడం జరిగింది.