చేజర్లలో ఘనంగా ప్రారంభమైన మహానాడు

పయనించే సూర్యుడు మే 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో క్లస్టర్ 11 ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలో మొదటి రోజు 2026 వర్చువల్ గా జరుగు మహానాడు సందర్భంగా మొదటగా బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం సాయి కళ్యాణ మండపంలో హైబ్రిడ్ పద్ధతిలో వర్చువల్ గా ఎల్ఈడీ స్క్రీన్లలో అందరూ సభను వీక్షించి హాజరు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం. రామనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు