త్సవటపల్లి వెంకటేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

పయ నుంచి జూలై 5 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వా కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరావు మరణించారు. వారి కుటుంబ సభ్యులను పలువురు నాయకులు, మాజీ సర్పంచులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో అమలాపురం జనసేన నాయకులు కల్వకుల్లు తాతాజీ, ఏడిద శ్రీను, కుతుకులపూడి శివ, మానే శ్రీను, గోకరకొండ శివ, విజయనగరం మాజీ సర్పంచ్ బాల అప్పలరాజు, కొందుకుదురు మాజీ సర్పంచ్ మెడిద ప్రసాద్, వీరవెల్లిపాలెం మాజీ సర్పంచ్ సలాది బుచ్చిరామ్మూర్తి, రాయపురెడ్డి జానికిరామయ్య, కోటి బాబుగా పిలిచే సి హెచ్ రాంబాబు, గొర్రెల గుద్దటి నాగరాజు, కృష్ణ, చెల్లి అశోక్, ఏడిద శ్రీమన్నారాయణ, గుత్తుల ధర్మరాజు, అల్లవరం శీనురాజు, గొలకోటి పాపారావు, త్సవటపల్లి నాగేంద్రరావు, గొల్లకోటి దొరబాబు కంది కుప్ప సొసైటీ సెక్రటరీ వై రామచంద్రరావు ప్రముఖ పత్రిక విలేకరి బ్రహ్మాజీ తదితరులు ఉన్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభించాలని వారు ఆకాంక్షించారు.