నూతన తహశీల్దార్ శిరీషని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్ క్రాస్ ప్రతినిధులు

★ శాలువాతో ఘన సత్కారం - రెడ్ క్రాస్ బలంపై చర్చ ★ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 'కోహెన్స్ లైఫ్ సైన్సెస్'లో భారీ రక్తదాన శిబిరం: 77 మంది రక్తదానం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇంచార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం జూన్ 15 జగ్గయ్యపేటపట్టణం జగ్గయ్యపేట మండలానికి నూతనంగా విచ్చేసిన తహశీల్దార్ శిరీషని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్ కర్లపాటి వెంకట శ్రీనివాసరావు, జగ్గయ్యపేట సబ్ బ్రాంచ్ చైర్మన్ గోగుశెట్టి . మహేష్, ట్రెజర మానేపల్లి నాగబ్రహ్మం ల ఆధ్వర్యంలో తహసిల్దార్ ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నూతన తహశీల్దార్ శిరీషకి రెడ్ క్రాస్ ప్రతినిధులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం జగ్గయ్యపేట పరిధిలో రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ద్వారా చేపడుతున్న వివిధ సామాజిక, మానవతా సేవా కార్యక్రమాలను ఆమెకు వివరించారు. స్థానికంగా రెడ్ క్రాస్ సంస్థ