నేలకొండపల్లి మండల స్థాయి బిజెపి బిఎల్ఎ టు సమావేశం.

పయనించే సూర్యుడు .. మే..28…బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు పాలేరు నియోజకవర్గ నకిరికంటి వీరభద్రం పాల్గొని జూన్లో జరిగే కార్యక్రమంలో మన బిజెపి లు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటినుంచే బిజెపి కార్యకర్తలు ఎస్ఐఆర్ గురించి అవగాహన కల్పించుకుంటూ ప్రజలతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం గనక ,మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బిజెపి నాయకులందరూ కలిసికట్టుగా సమన్యాయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాలేబోయి గోవిందరావు బిజెపి అధికార ప్రతినిధి సూరేపల్లి జ్ఞానరత్నం మండల అధ్యక్షు కార్యదర్శిలు తంగేళ్ల సతీష్ జైల్లా సురేష్ ST మోర్చా తేజవత్ నాగరాజు బిజెపి నాయకులు ఎలిగేటి గిరి పిట్టల సూరిబాబు దివాకర్ వేణుబాబు ఎలిగేటి వెంకటేష్ మూడు రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.