పయనించే సూర్యుడు మే 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా బిజెపి "పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్" కార్యక్రమం జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ అధ్యక్షతన రెండవ రోజు మొయినాబాద్ ప్రగతి రిసార్ట్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్ రావు పార్టీ సంస్తాగత నిర్మాణము పై పలు అంశాలు చర్చించడం జరిగింది. ఈకార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గం నుండి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..