పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ.

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 13 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజు న. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని ఎంఈఓ డి రవీందర్, హెచ్ఎం నక్కా బాబురావు అన్నారు. నందిగామ డివిజన్లోనే ఎక్కువ అడ్మిషన్లు సాధించినందుకు శ్రీ స్వామి పుల్లయ్య మెమోరియల్ పాఠశాల ఉపాధ్యాయులను పెనుగంచిప్రోలు మండలం ఎంఈఓ రవీంద్ర నాయక్ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు నోట్స్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మక్కా సత్యనారాయణ వేగినేటి వెంకటరమణ ,బండి రాఘవరావు, గంటా వెంకటేశ్వరరావు, నల్లూరి పద్మ, వాణి, స్వాతి శిల్ప ,శ్రీదేవి, త్రివేణి, ప్రమీల, ఉష, భారతి తదితరులు పాల్గొన్నారు.