ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే ప్రజా ప్రతినిధుల బాధ్యత: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్,మే 21 మామిడిపెల్లి లక్ష్మణ్ పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్‌ 2.0 పథకం కింద రూ.15.20 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు, రూ.3.14 కోట్లతో పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించే నీటి ట్యాంకు ద్వారా పట్టణంలోని దాదాపు 20 వేల మందికి తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో తొంబర్రావుపేట వద్ద తూము, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో రాయికల్‌, చెర్లకొండాపూర్‌ నుంచి బోర్నపల్లి వరకు వేసవిలో నీటి సమస్యను తగ్గించామని గుర్తు చేశారు. పైప్‌లైన్ పనుల సమయంలో తలెత్తే ఇబ్బందుల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్‌, వైస్‌ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ మనోహర్‌ గౌడ్‌, ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో నాగార్జున, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,మాజీ వైస్ చైర్మన్ రమాదేవి అచ్యుత రావు, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్,మచ్చ లక్ష్మి (శేఖర్), భూక్య రాకేష్ నాయక్,లతిక అనిల్,పుర్రె శ్రీధర్,కల్లెడ చిన్న ధర్మపురి, కునారపు మానస భూమేష్, బత్తిని మహేశ్వరి నాగరాజు,నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్ రావు పడిగేల రవీందర్ రెడ్డి,మహేందర్ బాబు జక్కుల స్వామి, భీమయ్య, బొద్దుల శివ, మున్సిపల్ మేనేజర్ వెంకటి, మున్సిపల్ సిబ్బంది,మెప్మా టిఎంసి శరణ్య,మెప్మా ఆర్పీలు, పట్టణ,మండల నాయకులు, సర్పంచులు,తదితరులు పాల్గొన్నారు.