బోధన్ ఆర్డీవో కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమం

★ దరఖాస్తులు స్వీకరిస్తున్న పరిపాలన అధికారి వెంకటేష్

పయనించే సూర్యుడు న్యూస్ మే 26 బోధన్ :బోధన్ ఆర్డిఓ కార్యాలయములో సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు జరిగిన డివిజనల్ ప్రజాపాలన కార్యక్రమం లో పరిపాలన అధికారి పి.వెంకటేష్ అన్ని శాఖల డివిజనల్ స్థాయి అధికారులతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు భూ సమస్యలు మొదలుకొని నీటి పైప్ లైన్ సమస్య రిటైర్డ్ ఉద్యోగి తాలూక వేతనాల సమస్య డబల్ బెడ్రూంలు సమస్య విద్యాశాఖ లో ఒక విద్యార్థి అడ్మిషన్ సమస్య వయో వృద్ధుల పెన్షన్ సమస్య కలిపి 9 దరఖాస్తులు నమోదు అయ్యాయని పరిపాలన అధికారి పి వెంకటేష్ తెలిపారు.