మాణిక కృష్ణయ్య అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొంది స్వగృహం నందు విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 4 వత్సవాయి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన మాణిక కృష్ణయ్య అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొంది స్వగృహం నందు విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అదే గ్రామానికి చెందిన పిడతల తేరోజమ్మ ఇటీవలే కాలంలో అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారితో పాటు గ్రామ మాజీ సర్పంచ్ పాపినేని రాంబాబు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా రైతు విభాగ కార్యవర్గ సభ్యులు చప్పిడి సాయిబాబు, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ తదితరులు పరామర్శించారు.