పయనించే సూర్యుడు న్యూస్ :మే 21, తల్లాడ రిపోర్టర్ రాష్ట్రవ్యాప్తంగా వివోఏ ల సమ్మెకి పిలుపునిచ్చింది. సోమవారం జేఏసీ వివోఏలు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్న జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివో ఏలు సమ్మె చేయాలని రాష్ట్ర కమిటీ ఏకాభిప్రాయం చేయడం జరిగింది. ఈ సమ్మె దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా వివోఎ లందరూ శాంతియుతంగా నిరావధిక సమ్మె నిర్వహించాలని ఐకెపి (సెర్ప్) జేఏసీ వివోఎ అందరూ కలిసి కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా వారు తెలిపారు. డి.సుజాత, భానుశ్రీ, కళావతి, విజయలక్ష్మి ,ప్రసన్న, వెంకటలక్ష్మి, అనుసూర్య తదితరులు పాల్గొన్నారు