రూ 24.96 లక్షల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 4 గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం బాధితులకు రూ 24,96,030 ఎల్ ఓ సి లను 52 మంది బాధితులకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎవరు కూడా చికిత్స చేయించుకున్న పేద ప్రజలకు వైద్యం కోసం ఖర్చయిన నగదును చెల్లించిన దాఖలాలు లేవన్నారు. గత రెండేళ్ల కాలంలో రూ 6.8 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.