వడదెబ్బ పట్ల నా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలిమేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ సూచించారు

పయనించే సూర్యుడు మే 23 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం ఖానాపూర్ రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్ గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు.

ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు

నీరు ఎక్కువగా తాగాలి దాహం వేయకపోయినా ప్రతి గంటకు ఒక గ్లాసు మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలి.

వేడి సమయంలో బయటకు వెళ్లొద్దు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగడం మానుకోవాలి. తప్పనిసరి అయితే గొడుగు, టోపీ, తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి.

లక్షణాలు గుర్తించాలి తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం వడదెబ్బ లక్షణాలు. ఇలాంటివి కనిపిస్తే వెంటనే నీడకు చేర్చి, శరీరంపై తడి గుడ్డ వేసి, దగ్గరలోని పిహెసి కి తరలించాలి.

పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండలోకి వెళ్లకుండా చూసుకోవాలి.

ఆల్కహాల్, కాఫీ మానేయాలి ఇవి శరీరంలో నీటిని తగ్గిస్తాయి.

    గ్రామంలో ఎవరికైనా అస్వస్థతగా అనిపిస్తే వెంటనే పంచాయతీ కార్యాలయానికి గానీ మా పాలకవర్గం సభ్యులకు లేదా వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సర్పంచ్ దాసరి రమేష్ కోరారు. ఒక్కరి ప్రాణం పోయినా అది గ్రామానికే నష్టం. అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఆయన విజ్ఞప్తి చేశారు.