పయనించే సూర్యుడు న్యూస్ :మే 31, తల్లాడ రిపోర్టర్ గ్రామ దీపికల న్యాయమైన డిమాండ్స్ ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలానీ వి ఎ ఓ ల ఏఐటీయూసీ అనుబం ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా నాయకులు మంకెన కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వి ఓ ఎ లు తమ సమస్యలను పరిష్కరించాలని గత 9వ రోజులుగా ఏం తల్లాడ మండల కేంద్రంలో లో దీక్ష చేస్తున్నారు. వారి దీక్ష శిబిరాన్ని సదర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా మంకెన కృష్ణ మాట్లాడుతూమాట్లడుతూ వి ఓ ఎ లు వారు పడుతున్న కష్టానికి తగిన వేతనం ఇవ్వాలని 26000 నెలకి ఇవ్వాలన్నారు. పి యఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా 20 లక్షలు ఇవ్వాలని మరియు వారికి ఇబ్బంది కలిగించే మిగతా డిమాండ్స్ నీ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మీ న్యాయమైన డిమాండ్స్ సాధనలో మీ మీ పోరాటానికి అన్ని రకాలుగా ఏఐటీయూసీ సహయ సహకారాలు అందిస్తుందని వారు చెప్పారు ఈ సంగిబావంలో వి ఓ ఎ మరియు తల్లాడ మండల అధ్యక్షులు సుజాత మండల ప్రధాన కార్యదర్శి భాను శ్రీ మండల కోశాధికారి , వి కళావతి ఉపాధ్యక్షురాలు K. విజయలక్ష్మి సహాయ కార్యదర్శి యన్ . అనసూర్య తల్లాడ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పి.నాగ ప్రసన్న మండల గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి తో పాటు తల్లాడ మండలంలో అన్ని గ్రామాల వి ఓ ఎ లు దీక్షలో పాల్గొన్నారు.