పయనించే సూర్యుడు, జూన్ 13 బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం నందు వేలాలు నిర్వహించగా 1. కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు . రూపాయలు195000 రూపాయలకు. కే కరుణాకర్ తండ్రి జోగయ్య. భువనగిరి ఈ సంవత్సరం 25000 అధికంగా పాడడంతో అలాగే లడ్డు పులిహోర హక్కు 315000 సిద్ధిరాం మఠం. ఉమాపతి తండ్రి సిద్దయ్య.వీరన్నపేట వాస్తవ్యులు గత సంవత్సరం కంటే 20000 ఎక్కువగా పలకడంతో వీరికి హక్కులను కేటాయించడం జరిగిందని ఇంకా తలనీలాల సేకరణ హక్కు, టెంకాయలు అమ్ముకొనుట హక్కు రెండు పాటలలో ఎవరు రానందున వాయిదా వేయడం జరిగిందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కార్య నిర్వహణ అధికారి సి.వంశీ మరియు ముఖ్య అర్చకులు. ఓం నమశ్శివాయ, అర్చకులు, దేవాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.