పయనించే సూర్యుడు:రి పోర్టర్ శ్రవణ్ రాజ్ 29.5.2026 అనకాపల్లి జిల్లా చీడికాడ లో క్లస్టర్ 4 జాజి మొగ్గల గణేష్ క్లస్టర్ 5 పైలా ముత్యాలు నాయుడు తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వచిన మహానాడు కార్య క్రమం చీడికాడలో జరిగింది. దీనిలో భాగంగా వైవిఆర్ కళ్యాణమండపంలో జరిగి పండుగకు టీడీపీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చారు. కార్య క్రమంలో చిన్నం నాయుడు పాల్గొని కార్యకర్తలతో ముందు రోజు కలిసి మెయిన్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి ర్యాలీగా తరలివచ్చి మహానాడు జరిగే సభాప్రంగణానికి తరలివెళ్లారు. ఓ పక్క తెలుగు తమ్ముళ్లు సభాప్రంగణం వద్ద తెలుగు దేశం పార్టీ జెండాను ఎగురవేసి మహానాడు కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ 45 ఏళ్ల తెలుగు దేశం పార్టీ కి కార్యకర్త లే వెన్నుముక్క అని అన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనం మన తెలుగు దేశం పార్టీ అని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కోరారు కార్య క్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పోతల చిన్నంనాయుడు మాజీ జెడ్పిటిసి పోతల రమణమ్మ క్లస్టర్ ఇంచార్జ్ పైలా ముత్యాల నాయుడు మహిళలు యువకులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రధాన మాజీ కార్యదర్శి బండారు అప్పలనాయుడు మహానాడులో బయలుపూడి గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ఎంపీటీసీ ప్రసాద్ మాస్టారు