జనం న్యూస్ జూన్ 7 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎక్లాస్ ఖాన్పేట తండా గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి సరిత ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, తాగునీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, జల పరిరక్షణ, మొక్కల నాటకం వంటి అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని సర్పంచ్ ధారావత్ వరలక్ష్మి పిలుపునిచ్చారు.