పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 21 మామిడిపెల్లి లక్ష్మణ్ ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు నియంత్రించాలని, కార్పోరేట్ సంస్థల డిస్కౌంట్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తటపెట్టిన బంద్ విజయవంతం అయింది. రాయికల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీచౌక్, శివాజీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి దుకాణాలు మూసివేయించారు. అనంతంర గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గరిపల్లి శ్రీనివాస్, సభ్యులు శ్రీనివాస్, ఇమ్రాన్ హసం, విశ్వనాథం, రాంకిశోర్, రమేశ్, నాగమల్ల శ్రీకర్, నర్సయ్య, హన్మంతు పాల్గొన్నారు.