పశువుల పై పెద్దపులి దాడి.

పయానించే సూర్యుడు ప్రతినిధి సాగర్ జూన్. 4.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,చిన్న రమనయ్యపేట గ్రామపంచాయతీ, పరిధిలో ఉన్న గంగంపాలెం గ్రామంలోకి తెల్లవారుజామున పెద్దపులి ప్రవేశించి.ఒకే రాత్రిలో పదమూడు దూడలు,ఒక గేదెదూడ పిల్లను పై దాడి చేసి హతమార్చింది.ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుండి ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్.నాగేశ్వర రావు,రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి,రంపచోడవరం డిఎఫ్‌ఓ ఎన్.రామచంద్ర రావు,రాజమండ్రి ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్‌ఓ టి.శ్రీనివాస రావు,రంపచోడవరం సబ్ డిఎఫ్‌ఓ టి.అనూష,అడ్డతీగల సబ్ డిఎఫ్‌ఓ జె.వి.సుబ్బారెడ్డి,ఇందుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొండల రావు,ఫోక్స్‌పేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు,ఆరు ర్యాపిడ్ రెస్క్యూ టీమ్ (ఆర్.ఆర్.టి) బృందాలు,ఐదు ప్రజా అవగాహన బృందాలు,నాలుగు ట్రాంక్విలైజింగ్ బృందాలు,రెండు డ్రోన్ బృందాలు,ఒకటి కేజ్ బృందం,ఒకటి వన్యప్రాణి అంబులెన్స్ బృందం మరియు ఫ్రంట్‌లైన్ సిబ్బందితో కూడిన పందొమ్మిది హనుమాన్ బృందాలు,మొత్తం సుమారు వంద మంది సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.నిన్న రాత్రి హనుమాన్ బృందాలు సమీపంలోని గ్రామస్తులకు పెద్ద పులి సంచారం గురించి తెలియజేశాయి.పశువులను కోల్పోయిన రైతులకు అటవీ శాఖ వెంటనే నష్టపరిహారం చెల్లిస్తుందని.సీనియర్ అటవీ అధికారులు హామీ ఇచ్చారు.ప్రజల రాకపోకలను నియంత్రించడానికి,అటవీ శాఖ పోతవరం-దండంగి రహదారిని దిగ్బంధించి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.హనుమాన్ బృందాలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండి,పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *