పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 06 మామిడిపెల్లి తేదీ 05.06. 2026 రోజున రాయికల్ మండలం, మూటపల్లి అంగన్వాడీ కేంద్రంలలో శుక్రవారం రోజున ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవుల 15 జూన్ వరకు పొడిగించిన సందర్భంగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు బరువులు ఎత్తులు తీసి తల్లులకు అవగాహన కలిగించి వారికి సరుకులు బియ్యము పప్పు, నూనె, గుడ్లు, పాలు, బాలామృతము, బాలామృతం ప్లస్సు, మురుకులు ఇంటికి ఇవ్వడము జరిగినది. అనంతరం మొక్కలను నాటారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేష్, కార్యదర్శి దివ్య జ్యోతి, సూపర్వైజర్ అనూహ్య, అంగన్వాడి టీచర్ పి. రాజవ్వ, గర్భవతులు బాలింతలు తల్లులు పిల్లలు పాల్గొన్నారు