పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 08 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అందరి బాధ్యత అని ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేర్పును పెంచేందుకు ఉపాధ్యాయ బృందంతో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటిక్యాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరిదని అన్నారు. గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యలభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, వేల్పుల స్వామి యాదవ్, గాజెంగి రాజేశం, హన్మంతరావు, ఎద్దండి రమేష్ రెడ్డి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.