నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైనతిప్పారపు అశ్విత్

జనంన్యూస్ జూన్ 07 ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలోని జడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న తిప్పారపు అశ్విత్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపిక అయినట్లం ఎం ఈ వో అనసూరి నరేంద్రచారి తెలిపారు . ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థికి ఒక సంవత్సరానికి 12000/- వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ వస్తుంది అన్నారు .9 వ, తరగతి నుండి 12 వ, తరగతి వరకు నాలుగు సంవత్సరాల పాటు ఈ ఆర్థిక సహాయం అందుతుంది అని ,ఈ పథకం ముఖ్యంగా ప్రభుత్వ జిల్లా పరిషత్ ,ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసమే ఈ పథకం రూపొందించబడింది అని ఎం ఈ వో తెలిపారు . ఈ పథకానికి తిప్పారపు అశ్విత్ ఎంపిక పట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాలు ఎం ఈ వో నరేంద్ర చారి ,ఉపాద్యాయులు ,గ్రామ సర్పంచ్ బాపయ్య ,ఉప సర్పంచ్ రమేష్ రావు,తల్లిదండ్రులు ,గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *