పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 16 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జగ్గయ్యపేట పురుషుల విభాగం మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వంద రోజుల చలి వేంద్రం కార్యక్రమం లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నవకళ క్లాత్ షోరూం ప్రక్కన తుమ్మేపల్లి సాయిచంద్ ఖాళీ స్థలం వద్ద ” అమావాస్య “సందర్భంగా కీ శే గుండా పూర్ణచంద్ర రావు జ్ఞాపకార్థం వారి సతీమణి గుండా తాయారువారి కుమారుడు కృష్ణ దీపక్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి దాతల చేతుల మీదగా పంపిణి జరిగింది. కీర్తిశేషులు వంగేటి నాగలక్ష్మి పార్వతి జ్ఞాపకార్థం వారి కుమార్తె కాకరపర్తి నాగ వెంకట శివ జ్యోతి, అల్లుడు కాకరపర్తి సోమేశ్వరరావు సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ర ఐ వి ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు, రాష్ట్ర ఆధ్యాత్మిక కమిటీ వైస్ చైర్మన్ పేరూరి వెంకట లక్ష్మీ నరసింహారావు చింతా వెంకట శేషానoధం, ఐ వి ఎఫ్ జిల్లామహిళా విభాగం ప్రెసిడెంట్ వీరవల్లి పద్మావతి శ్రీనివాస్, పట్టణ పురుషల విభాగం ప్రెసిడెంట్ వీరవల్లి శ్రీనివాస రావు, రాయపూడి రమేష్, గెల్లా నాగేశ్వరావు, పెనుగొండ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ స్వామి కృష్ణ, పట్టణ మహిళావిభాగం కోశాధికారి వీరవల్లి ప్రమీల చంద్రం, కాకరపర్తి జ్యోతి, వాసా నాగమణి తదితరులు పాల్లో న్నారు.