ఎస్ ఎల్ పి నియోజకవర్గంలో జరుగుతున్నసార్ పై రంగారెడ్డి జిల్లాఅర్బన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

పయనించే సూర్యుడు జూలై 04 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ నేడు జరుగుతున్న ఎస్ఐఆర్ పై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మసీద్ బండ, కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆధ్వర్యం లో నియోజకవర్గ సీనియర్ నాయకుల తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.శక్తి కేంద్ర ఇన్చార్జిలు, సీనియర్ నాయకులు కలిసి పార్టీ తరఫున ఏర్పా టు చేసిన బిఎల్ఏ2 లను ఎప్పటిక ప్పుడు సంప్రదించి,సక్రంగా బిఎల్ఓ లు పని చేస్తున్నారా లేదా అంతేకా కుండా డబల్ ఓట్లు ఉన్న వారిని గు ర్తించి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే అర్హులై ఓటు హక్కు లేదు వారు ఓటు హక్కు పొందే విధంగా ఈ ఎల్ ఏ2 లు పని చెయ్యాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేసి రేపు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ అభ్యర్థులు అత్యధికంగా గెలవాలంటే ఈ ఎస్ ఐ ఆర్ ను మనమంతా సక్రమంగా నిర్వహించినట్లయితే దొంగ ఓట్లు తొలగిపోయి నిజమైన ఓటర్లను గుర్తించినట్లయితే రేపు మన పార్టీ గెలుపుకు సులభ మార్గం అవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహి పాల్ రెడ్డి,మాణిక్ రావు, దుర్గా ప్రసాద్, అశోక్ కురుమ, పద్మ,సీతారామరాజు, వేణుగోపాల రెడ్డి ,వంశీ రెడ్డి, శ్రీనివాస రెడ్డి ,కిషోర్, నరసింహ రాజు తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *