పయనించే సూర్యుడు జూన్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ఇటీవల పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ గా నియమితులైన డా.రాహుల్ దేవ్ రాజ్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పేరు,ప్రఖ్యాతలు కలిగిన నిమ్స్ ఆసుపత్రికి వచ్చే పేదలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజు,సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.