పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకులను గురువారం నిర్వహించారు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 29. 05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// ఈ సందర్భంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ముస్లింలను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ముస్లింలు ఉదయం నుంచి మసీదుల వద్ద ఈద్గా ల వద్ద నమాజులు నిర్వహించారు పుంగనూరు పట్టణ పరిసర ప్రాంతాలలోని వేలాది మంది ముస్లింలు నూతన దుస్తులు ధరించి పట్టణ సమీపంలోని ఎన్ఎస్ పేటలో గల ఈద్గా వద్ద తోపు మఠం లో మహమ్మద్ అలీ నిర్మించిన ఈద్గా వద్ద ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు అక్కడ మత గురువులు అల్లా బోధనలువినిపించారుఅక్కడి నుంచి నేరుగా స్మశాన వాటిక లకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు ముస్లింలు అలహా అక్బర్ అంటూ ప్రార్థనలు చేశారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు బక్రీద్ పండుగ సందర్భంగా మసీదుల వద్ద ఇండ్ల వద్ద పేదలకు నగదు దుస్తులు అన్నదానాలు నిర్వహించారు హిందూ ముస్లింలు అందరూ కలిసి పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విందు భోజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఆలీం భాష అయుబ్ ఖా న్ ఫక్రుద్దీన్ షరీఫ్ అమ్ము ఎంఎస్ సలీం కిజర్ ఖాన్ ఖాదర్ సిద్దిక్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *