బాధితురాలిని పరామర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

తక్షణ సహాయ నిమిత్తం 50,000 అందించిన ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు జూన్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి నరేందర్ నాయక్ ) ఖమ్మం జిల్లాలోని రాపర్తి నగర్‌లో జరిగిన ఘటనలో తీవ్ర గాయాలపాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. ఈ దారుణ ఘటనలో, మహమ్మద్ గౌస్ అనే 49 ఏళ్ల స్థానిక డ్రైవర్, 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి , ఆమెను ఒక అపార్ట్‌మెంట్ భవనం పైకప్పు పైనుంచి కిందకు తోసేశాడు.ఈ సంఘటన 2026 జూన్ 6వ తేదీన జరిగింది .ఆ మైనర్ బాలిక కొత్తగూడెం నుండి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న తన తాతను కలవడానికి వచ్చింది. నిందితుడు ఆమెను ఒక మూలకు నెట్టి, లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతను ఆమెను భవనం పైనుంచి తోసేశాడు. మొదట ఆమె ప్రమాదవశాత్తు పడిపోయిందని వారు భావించారు. ఆమె వెన్నెముక, చేతులు, పక్కటెముకలకు తీవ్రమైన పలు విరుగుళ్లతో పాటు, అంతర్గత గాయాలకు కూడా గురైంది. జూన్ 8, 2026న, ఆమె ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చి, జరిగిన దారుణాన్ని తన కుటుంబానికి వివరించినప్పుడు అసలు నిజం వెలుగులోకి వచ్చింది.ఇట్టి విషయం తెలుసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే , ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి బాధితురాలిని పరామర్శించారు. తక్షణ సహాయంగా 50,000/- అందించారు. ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని అలాగే నిదితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామని బాలికా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు సంపత్ కుమార్, ఎన్.రాజు, ఏం. ఎన్.రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *