పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 30 మామిడిపెల్లి లక్ష్మణ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా జరిగే జాతర ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ చెన్నమనే ని విష్ణువర్ధన్ రావు వంశవర్ధన్ రావు ఆధ్వర్యంలో దాతలు ఇచ్చిన విరాళాలు 8 లక్షల రూపాయలు ఈరోజు కేడీసీసీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ నాగిరెడ్డి కోశాధికారి బోర్డులో మల్లారెడ్డి మాజీ సర్పంచ్ సామల లావణ్య వేణు మాజీ ఎంపిటిసి కొప్పులరాధా ఆదిరెడ్డి కనపర్తి శ్రీనివాస్ అయ్యగారు రామకృష్ణ పంతులు దాతలు నాయిని రమేష్ గౌడ్ సంద రాధా తదితరులు పాల్గొన్నారు