జనం న్యూస్ మధిర జూన్ 7 దోర్నాల కృష్ణ గంపలగూడెం, బోనకల్లు, చింతకాని మండలాల్లో వరుస గేదెల చోరీలకు పాల్పడుతున్న ముఠా పట్టివేతరెండు అశోక్ లేలాండ్ వాహనాలు స్వాధీనం చేసుకొని నలుగురిని రిమాండ్కు తరలించిన పోలీసులు పెనుగంచిప్రోలు ప్రాంతానికి చెందిన కంభం సాయి, పెనుగొండ సాయి, ఓర్సు గోపాలకృష్ణ, ముద్రకోల గోపీచంద్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులపై గంపలగూడెం, బోనకల్లు, చింతకాని తదితర ప్రాంతాల్లో గేదెలు, మోటార్ల దొంగతనాలకు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు సీఐ మధు తెలిపారు.