లింగసానిపల్లిలో ఘనంగా మొక్కల పంపిణీ కార్యక్రమం

​ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టల చంద్రకళ శ్రీరాములు

పయనించే సూర్యుడు జులై 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం నాడు గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. నర్సరీ నుండి ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పూల మరియు పండ్ల మొక్కలను గ్రామంలోని ప్రతి ఇంటికి రెండు చొప్పున గ్రామ పెద్దలు, అధికారులు పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సర్పంచ్ పిట్టల చంద్రకళ శ్రీరాములు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటాలని, వాటిని కేవలం నాటడమే కాకుండా జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చెంచటి సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి ప్రసన్న, ఫీల్డ్ అసిస్టెంట్ నాగేంద్రం మరియు గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *