వాయిస్ -4 కార్యక్రమంతో 159 మంది మార్పుకర్తలుగా ఎదుగుతున్న యువ బాలికలు హర్ వాయిస్ తో నాయకత్వం

* అడుగులు వేస్తున్న బాలికలు * సఖి పీర్ లీడర్ల సోదరీ భావం * భావి మహిళా నాయకుల తరాన్ని * తీర్చిదిద్దుతున్న వాయిస్ -4 కార్యక్రమాలు

పయనించే సూర్యుడు జులై 4 ప్రతినిధి సుధాకర్ డిండి నల్లగొండ యుక్తవయసు బాలికలలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన పెంపొందించేందుకు వాయిస్ -4 సంస్థ అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమం ‘హర్ వాయిస్’ విశేష ఫలితాలను అందిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన వేలాది మంది బాలికలకు ఈ కార్యక్రమం ద్వారా జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. సరదాగా నేర్చుకునే విధానంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమం ఉన్నత పాఠశాల (బాలికలు), ముండిగొండ (పాఠశాల పేరు, ప్రాంతం)లోని విద్యార్థినులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ కార్యాచరణలు, చర్చలు, ఆటల ద్వారా నిర్వహించిన శిక్షణలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని, కొత్త విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు. మొత్తం 159 మంది బాలికలకు ఈ కార్యక్రమం జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తూ, తమ కోసం తామే నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని పెంపొందించింది. ‘సఖి పీర్ లీడర్‌షిప్’ కార్యక్రమం ‘హర్ వాయిస్’లోని చివరి దశ. గత మాడ్యూళ్లలో నాయకత్వ లక్షణాలు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆసక్తిని ప్రదర్శించిన బాలికలను ‘సఖి’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా వారు తమ తోటి విద్యార్థులకు మార్గదర్శకులుగా, అవగాహన కల్పించే నాయకులుగా ఎదుగుతున్నారు. భవిష్యత్తులో సమాజంలో మంచి మార్పు తీసుకురాగల యువ నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యం. 2024-25 సంవత్సరంలో 256 మందికి పైగా యుక్తవయసు బాలికలు ‘సఖి’లుగా మారి తమ తోటి విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారిని ప్రోత్సహించే బాధ్యతను స్వీకరించారు. ‘హర్ వాయిస్’ కార్యక్రమంలో పాల్గొన్న బాలికలలో ముఖ్యమైన అంశాలపై అవగాహన గణనీయంగా పెరిగింది. అలాగే సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాల వినియోగంలో 38.5 శాతం పెరుగుదల నమోదవగా, నాయకత్వానికి సంబంధించిన విభిన్న అంశాలపై వారి అవగాహన కూడా మెరుగుపడింది. వాయిస్ -4 వ్యవస్థాపకురాలు అనూష భరద్వాజ్ మాట్లాడుతూ, “పరిచయ్ మాడ్యూల్ ద్వారా మా కార్యక్రమంలో చేరిన ఈ బాలికలు నేడు నాయకులుగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు తమ శరీరం, ఆరోగ్యం, వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం ప్రారంభించిన విద్యార్థినులు నేడు తమ తోటి బాలికల హక్కుల కోసం మాట్లాడుతున్నారు. వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. కుటుంబాల్లో ఉన్న అపోహలను తొలగించడంలో, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడంలో ముందుంటున్నారు” అని తెలిపారు. వాయిస్ -4 కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్థిని మాట్లాడుతూ, “సఖి లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా నేను నాలోని నాయకత్వ లక్షణాలను ఎలా మెరుగుపరుచుకోవాలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్ నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.” అని తన అనుభవాన్ని పంచుకుంది. ‘హర్ వాయిస్’ కార్యక్రమం మూడు దశలలో నిర్వహించబడుతుంది. అవి పరిచయ్, దిశా, సఖి పీర్ లీడర్‌షిప్. ప్రతి దశ 10 రోజుల పాటు సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ శరీరం, భద్రత, హక్కులు, భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకుంటారు. అలాగే తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, జీవిత లక్ష్యాల వైపు ముందుకు సాగడం నేర్చుకుంటారు. బాలికలను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడం, సమానత్వ భావనతో కూడిన సమాజ నిర్మాణానికి తోడ్పడడం లక్ష్యంగా ‘హర్ వాయిస్’ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయనున్నట్లు వాయిస్ -4 ప్రతినిధులు తెలిపారు.వాయిస్ -4 గురించి వాయిస్ -4 సంస్థ యుక్తవయసు బాలికలు, బాలురు మరియు యువత కోసం లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే సురక్షిత వేదికలను సృష్టిస్తూ, వినూత్న కార్యక్రమాలు మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా సామాజిక మార్పు కోసం పనిచేస్తోంది. ఇప్పటివరకు 3,50,000 మందికి పైగా బాలికలు, బాలురు మరియు యువ మహిళల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడంలో సంస్థ విజయవంతమైంది.వెబ్‌సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ వాయిస్ -4.ఆర్గనైజషన్ సమస్త వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ హనుమకుమారి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *